సామర్లకోట మఠం సెంటర్ లో స్వస్తిక్ మొబైల్ షాప్” లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.సదరు షాప్ యజమాని రాత్రి షాపు మూసి వెళ్ళిపోగా అర్ధరాత్రి సమయంలో షాపు పైన ఉన్న రేకులు తొలగించి గుర్తుతెలియని దొంగలు షాపు లో విలువైన సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రిని దొంగలించారు.ఉదయం దానిని గుర్తించిన యజమాని సమాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సిఐ ఎ కృష్ణ భగవాన్, క్రైమ్ సిఐ అంకబాబులు పరిశీలించారు.క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు.ఈ చోరీ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









