కరప మండలం నడకుదురు వ్యవసాయ శాఖ కార్యాలయంలో మట్టి నమూనాల సేకరణ పై ఏడిఏ కె బాబురావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.శాంపుల్స్ సేకరించేటప్పుడు వరి పొలాలలో 15 నుండి 20 సెంటీమీటర్లు లోపు మట్టిని తీసుకుని నీడలో ఆరబెట్టి భద్రపరచాలన్నారు. పండ్ల తోటలలో మూడు నుండి ఆరు అడుగుల లోతులో మట్టిని మాత్రమే సేకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సతీష్, ప్రశాంత్, ఎం టి ధనలక్ష్మి,ప్రకృతి వ్యవసాయ,అగ్రికల్చర్ అసిస్టెంట్ సిబ్బందికి, పాల్గొన్నారు.









