రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంటున్నప్పటికీ, తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై వివాదం చెలరేగింది. సినిమాలో హీరో పాత్రకు బలమైన కథ, భావోద్వేగాలు, సామాజిక నేపథ్యం ఇవ్వగా.. జాన్వీ పాత్రను మాత్రం కేవలం ప్రేమ సన్నివేశాలు, పాటలు, గ్లామర్ ప్రదర్శనకే పరిమితం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చర్చకు కారణమైనది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ పోస్ట్. “భారతీయ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్కు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం” అనే వ్యాఖ్యతో వచ్చిన ఆ పోస్ట్లో, కథలో మహిళా పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్ను జాన్వీ కపూర్ స్వయంగా లైక్ చేయడంతో, తన పాత్రపై ఆమెకూ అసంతృప్తి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రముఖ గాయని సుమంగళి అరియనాయగం కూడా ఈ అంశంపై స్పందిస్తూ, మహిళా పాత్రను కేవలం గ్లామర్ కోసం ఉపయోగించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పెద్ద సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.
ఒకవైపు ‘పెద్ది’ భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా, మరోవైపు జాన్వీ పాత్రపై వస్తున్న విమర్శలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వివాదంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.









