ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ రవి చీమలపాటి పిఠాపురం పాదగయ క్షేత్రం సందర్శనలో భాగంగా పిఠాపురం వచ్చారు. శుక్రవారం ఉదయం పాదగయలో ఆయన పూజలు చేస్తారు. కుమారపురం గోకుల్ గ్రాండ్ హోటల్కు చేరుకున్న జస్టీస్ను పిఠాపురం బార్ అసోషియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీహరి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ లు కూడా జస్టీస్ రవి చీమలపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురం సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు ఎ.బాబు, విజయరామేశ్వరిలు జస్టీస్కు పుష్పగుచ్ఛాలు అందజేశారు.









