ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వెల్లడించిన విషయం తెలిసిందే.ఇందుకు సంబంధించిన బిల్లుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా నేడు బిల్లు పార్లమెంటు ముందుకు రానున్నట్లు సమాచారం. అనంతరం ఈ బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలుస్తోంది.









