నేర రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తుల గూడెంలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని ఎస్ఐ మణి కుమార్ నిర్వహించారు.కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఉత్తర్వుల ప్రకారం, కాకినాడ సబ్డివిజనల్ ఆఫీసర్ ఏఎస్పీ మనీష్ దేవరాజు పాటిల్,సిఐ జి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ స్థానిక ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు.సైబర్ నేరాలు,ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని,యువత డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.జూదం,పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.









