టాలీవుడ్ దర్శకధీరుడు S. S. రాజమౌళి సినిమా అంటే ఇక అది కేవలం సినిమా కాదు… గ్లోబల్ ఈవెంట్. ప్రతి ఫ్రేమ్ను అద్భుతంగా మలిచే ఆయన, అదే శ్రద్ధను ప్రమోషన్లపైనా పెట్టడం ఆయన స్పెషాలిటీ. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో జక్కన్న స్ట్రాటజీలు ఎప్పుడూ ఒక లెవెల్ అప్లో ఉంటాయి. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబు హీరోగా రూపొందిస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు.
గ్లోబల్ ప్రమోషన్స్… కొత్త స్టార్ట్!
ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుండగా, మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే మెక్సికోలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీని గ్లోబల్ రేంజ్లో రిలీజ్ చేయాలనే ప్లాన్తో, అదే స్థాయిలో ప్రమోషన్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
సబ్స్క్రిప్షన్ ట్రెండ్… జక్కన్న కొత్త ఐడియా!
ఇప్పటివరకు సినిమాల ప్రమోషన్ అంటే మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలు, BTS క్లిప్స్ను ఉచితంగా విడుదల చేయడం కామన్. కానీ ఈసారి జక్కన్న కాస్త రూట్ మార్చారట. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న సబ్స్క్రిప్షన్ మోడల్ను ఉపయోగించబోతున్నారని టాక్.
రూ.199 స్పెషల్ ప్యాకేజ్!
ఈ మూవీకి సంబంధించిన బీటీఎస్ వీడియోలు, షూటింగ్ విశేషాలు, స్పెషల్ ఇంటర్వ్యూలు—all in oneగా ఒక ప్రత్యేక ప్యాకేజ్గా అందించబోతున్నారట. దానికి రూ.199 ధర నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో ప్రియాంక చోప్రా , మహేష్ బాబు ఇంటర్వ్యూలతో పాటు, ప్రేక్షకులకు ఎక్కడా దొరకని ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉండబోతుందట.
నెట్లో మిక్స్డ్ రియాక్షన్స్!
ఈ కొత్త ఐడియాపై సోషల్ మీడియాలో మిక్స్డ్ స్పందన వస్తోంది. కొందరు “ఇది నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్” అంటుంటే, మరికొందరు “టికెట్ ధరలే పెరిగిపోయిన సమయంలో ఇది అవసరమా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
హిట్ స్ట్రాటజీనా? లేక రిస్క్?
మొత్తానికి… జక్కన్న తీసుకున్న ఈ సబ్స్క్రిప్షన్ స్ట్రాటజీ ఇండస్ట్రీకి కొత్త దారితీస్తుందా? లేక ప్రేక్షకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.
రిలీజ్కి ముందే చర్చలు రేపుతున్న ‘వారణాసి’… బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి!







