కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ వింగ్ టీమ్ భారీగా గంజాయి పట్టుకుంది. జే.కొత్తూరు గ్రామంలో ఆటోలో 80 ప్యాకెట్ల రూపంలో ఉన్న 162.075 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మేకల ప్రకాష్,అవుల శ్రీనివాసులు, దనియాల అంజమ్మలతోపాటు, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మేకల శ్యామలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి రూ.లక్ష నగదు, సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఒడిస్సా నుండి అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పెద్దాపురం డీఎస్సీ శ్రీహరి రాజు తెలిపారు. కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో ఈగల్ వింగ్ గంజాయి రవాణాను అడ్డుకుందన్నారు. గంజాయిని పట్టుకోవడంలో సహకరించిన జగ్గంపేట సిఐ వై.ఆర్.కె.శ్రీనివాస్, ఎస్సై రఘునందనరావులను డీఎస్పీ హరిరాజు అభినందించారు. NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసామని డీఎస్పీ తెలిపారు.










