మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియన్ సినిమానే షేక్ చేసే రేంజ్ లైనప్తో దూసుకుపోతున్నాడు. ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్ట్తో పాటు… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే నెవర్ బిఫోర్ స్కేల్లో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే తారక్ బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మేకర్స్ కూడా ప్రత్యేకంగా ఓ కాన్సెప్ట్ టీజర్ను ప్లాన్ చేశారనే టాక్ బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో ఆ ట్రీట్ వాయిదా పడటంతో అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం… మేకర్స్ ఆ కాన్సెప్ట్ టీజర్ను జూన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వీడియోకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, డిజైన్ వర్క్పై మరింత కేర్ తీసుకుంటున్నారని… అందుకే రిలీజ్ను పోస్ట్పోన్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కథ విషయానికి వస్తే… యుద్ధానికి దేవుడిగా భావించే కుమారస్వామి బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. మైథాలజీ టచ్తో పాటు త్రివిక్రమ్ స్టైల్ ఎమోషన్స్, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ కలిస్తే ఈ సినిమా మరో లెవెల్లో ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్తో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మించనున్నాయి. మరి జూన్లో రాబోయే ఆ కాన్సెప్ట్ టీజర్ నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.









