కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తాలూకా హుండీలను గురువారం లెక్కించారు. గడచిన 35 రోజులు గాను శ్రీ సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1,83,28,659/-లు రాగా బంగారం 11 గ్రాములు, వెండి 625 గ్రాములు మరియు విదేశీ కరెన్సీ లభ్యమ య్యాయి. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐ వి రోహిత్, ఈవో వేండ్ర త్రినాధ రావు, దేవస్థానం అధికారులు, వ్రత పురోహితులు, నాయి బ్రాహ్మణులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.









