Search
Close this search box.

  టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రిటర్న్స్..! సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్..

April 24, 2026 9:52 PM | Aditya369 News

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రిటర్న్స్..! సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్..

టాలీవుడ్‌లో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించిన అందాల నటి సమీరా రెడ్డి, బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు దూరమైన ఆమె, ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండటం విశేషం.

 

2014లో వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పిన సమీరా రెడ్డి, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపై సాధారణ కమర్షియల్ పాత్రలకంటే, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.

 

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ సినిమా మే 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సంజయ్ దత్ ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తుండగా, నమాశి చక్రవర్తి విద్యార్థిగా నటిస్తున్నారు.

 

ఈ చిత్రంలో ఇందిరా గాంధీ హత్య తర్వాతి పరిణామాలు, అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వంటి కీలక చారిత్రక సంఘటనలను చూపించబోతున్నారు. మొత్తం మీద, ఈ మూవీతో సమీరా రెడ్డి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌లో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించిన అందాల నటి సమీరా రెడ్డి, బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు దూరమైన ఆమె, ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండటం విశేషం.

 

2014లో వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పిన సమీరా రెడ్డి, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపై సాధారణ కమర్షియల్ పాత్రలకంటే, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.

 

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ సినిమా మే 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సంజయ్ దత్ ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తుండగా, నమాశి చక్రవర్తి విద్యార్థిగా నటిస్తున్నారు.

 

ఈ చిత్రంలో ఇందిరా గాంధీ హత్య తర్వాతి పరిణామాలు, అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వంటి కీలక చారిత్రక సంఘటనలను చూపించబోతున్నారు. మొత్తం మీద, ఈ మూవీతో సమీరా రెడ్డి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు