ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్షలకు న్యాయస్థానాన్ని వేదికగా చేయొద్దని రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.








