టాలీవుడ్లో “గాడ్ ఆఫ్ మాసెస్”, “యంగ్ టైగర్”గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. ‘దేవర’ తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ప్రారంభమై చాలాకాలం అయినప్పటికీ ఇప్పటివరకు సుమారు 40% మాత్రమే పూర్తయ్యిందని సమాచారం. ఈ నెమ్మదైన ప్రోగ్రెస్ వల్ల అభిమానుల్లో కొంత నిరుత్సాహం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా “డ్రాగన్” అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. త్వరలోనే అధికారిక టైటిల్ను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటీనటుల ఎంపికపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. మొదటగా మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్లో భాగమవుతున్నారని అధికారికంగా ప్రకటించారు. కానీ తాజాగా ఒక ఈవెంట్లో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలు, డేట్స్ సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
టోవినో తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. చిత్రబృందం ఇప్పటికే ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కథ విన్న షాహిద్ కపూర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతున్నారు. అలాగే అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారని, కుష్బూ కూడా ఈ సినిమాలో భాగమవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
మొత్తానికి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక అన్ని విషయాలపై క్లారిటీ రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








