స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ అభిమాన చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తమ పెళ్లికి ఎందుకు పిలవలేదని నిలదీస్తూ సోషల్ మీడియాలో క్యూట్గా అలిగిన ఒక చిన్నారిని పిలిపించి మరీ విందు భోజనం వడ్డించారు. ఈ ‘లిటిల్ ఫ్యాన్’ను తమ ఇంటికి ఆహ్వానించిన విరోష్ జంట, ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించారు. ఆ చిన్నారికి ఇష్టమైన లడ్డూలు, పులిహోరను స్వయంగా వడ్డించి, ఆ పాపతో సరదాగా కబుర్లు చెబుతూ గడిపిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 26న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి వేడుకల వీడియోలు చూసిన ఈ చిన్నారి.. “మనల్ని కూడా పిలవొచ్చు కదా, మనం కూడా ఫ్యాన్సే కదా” అని అడిగిన వీడియో విజయ్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన విజయ్, “బుజ్జి తల్లీ.. నీకు నచ్చిన ఫుడ్ చెప్పు, ఇంటికి పిలిచి భోజనం పెడతాను” అని ప్రామిస్ చేశారు. తాజాగా ఆ మాట ప్రకారం చిన్నారి కుటుంబ సభ్యులను పిలిపించి, తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ఈ క్యూట్ వీడియో చూసిన నెటిజన్లు విజయ్, రష్మికలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక స్టార్ సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా, ఒక సామాన్య అభిమాని చిన్నారి కోరికను గుర్తించి ఇంటికి పిలవడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు. పాపతో విజయ్, రష్మికలు ఫ్రెండ్లీగా మెలిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ కొత్త దంపతులు తమ వివాహం తర్వాత ఒకరి సినిమాలతో మరొకరు బిజీగా ఉండటమే కాకుండా, ఇలాంటి సామాజిక మరియు వ్యక్తిగత కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.









