నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఈసారి అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కొంత నిరాశనే మిగిల్చింది.
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్ట్ను దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
NBK112కి ‘కురుక్షేత్రం’ టైటిల్..?
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య, దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరో ఆసక్తికర ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. ‘NBK112’గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ కారణంగా సినిమా మహాభారతం నేపథ్యంలో ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది.
మైథాలజీ టచ్తో బాలయ్య మూవీ?
వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని చూపించారు. ఇప్పుడు బాలకృష్ణతో కలిసి మైథాలజికల్ టచ్ ఉన్న కథను తీసుకురాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
NBK111లో హీరోయిన్ మార్పు..?
మరోవైపు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘NBK111’ సినిమా గురించి కూడా ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను మొదట హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేసినప్పటికీ, తర్వాత స్క్రిప్ట్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
మొదట హీరోయిన్గా నయనతారను తీసుకున్నారని ప్రకటించినప్పటికీ, తాజా మార్పులతో హీరోయిన్ కూడా మారిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది..









