Search
Close this search box.

  ‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

July 14, 2026 9:19 AM | Aditya369 News

‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో ఆస్కార్ అవార్డు సాధించి భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'తో మరోసారి ప్రపంచ వేదికను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈసారి కూడా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో జక్కన్న టీమ్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆస్కార్ క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించిన రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ.. ఆ అనుభవాన్ని ఇప్పుడు 'వారణాసి' కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. చిత్రాన్ని ఏయే ఆస్కార్ కేటగిరీల్లో పోటీకి నిలపాలి? విదేశాల్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయాలి? గ్లోబల్ మార్కెటింగ్ ఎలా ఉండాలి? అనే అంశాలపై ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ లాంచ్ కార్యక్రమంలో కార్తికేయ ఈ విషయంపై స్పందించాడు. భారతదేశంలో ప్రపంచ స్థాయి సినిమాలు రూపొందుతున్నాయని, సరైన మార్కెటింగ్ వ్యూహం ఉంటే ఆస్కార్ అందుకోవడం అసాధ్యమేమీ కాదని ఆయన పేర్కొన్నారు.

ఇలా ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తున్న రాజమౌళి బృందం.. 'వారణాసి'తో మరోసారి తెలుగు సినిమా జెండాను అంతర్జాతీయ వేదికపై ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఆస్కార్ అవార్డు సాధించి భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో మరోసారి ప్రపంచ వేదికను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈసారి కూడా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో జక్కన్న టీమ్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్ క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించిన రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ.. ఆ అనుభవాన్ని ఇప్పుడు ‘వారణాసి’ కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. చిత్రాన్ని ఏయే ఆస్కార్ కేటగిరీల్లో పోటీకి నిలపాలి? విదేశాల్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయాలి? గ్లోబల్ మార్కెటింగ్ ఎలా ఉండాలి? అనే అంశాలపై ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో కార్తికేయ ఈ విషయంపై స్పందించాడు. భారతదేశంలో ప్రపంచ స్థాయి సినిమాలు రూపొందుతున్నాయని, సరైన మార్కెటింగ్ వ్యూహం ఉంటే ఆస్కార్ అందుకోవడం అసాధ్యమేమీ కాదని ఆయన పేర్కొన్నారు.

ఇలా ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తున్న రాజమౌళి బృందం.. ‘వారణాసి’తో మరోసారి తెలుగు సినిమా జెండాను అంతర్జాతీయ వేదికపై ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు