సూపర్స్టార్ మహేశ్బాబు, దర్శక ధీరుడు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఒక భారీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు..ఇకపై షెడ్యూల్ను కెన్యాలో ప్లాన్ చేసిన చిత్రబృందం, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు దాన్ని సౌతాఫ్రికాకు మార్చినట్టు సమాచారం. అక్కడ ఓ ప్రధాన టాకీపార్ట్తో పాటు, ఒక పాట, అడవిలో సాగే మేజర్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల కోసం ఇప్పటికే యూనిట్ రిహార్సల్స్తో బిజీగా ఉంది..ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే… యాక్షన్ సన్నివేశాలను మహేశ్బాబు డూప్ లేకుండా స్వయంగా చేయబోతున్నారట. ఈ కారణంగా షూటింగ్ సమయంలో యూనిట్ పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది.కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో మాధవన్, పృథ్వీ రాజ్ సుకుమారన్ కనిపించనున్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.. హై ఎండ్ విజువల్స్ తో ఈ సినిమా భారీగా వండర్ గా రానుంది..ఈ మూవీపై ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది..









