కేజీఎఫ్’ సిరీస్తో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇప్పుడు టాలీవుడ్నే తన హబ్గా మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ‘సలార్’తో ప్రభాస్కు మాస్ బ్లాక్బస్టర్ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ అనే ఓ భారీ సినిమా చేస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ 2026 జూన్లో విడుదల కానుంది..ఆ తర్వాత ప్రశాంత్ నీల్, మళ్లీ ప్రభాస్తో ‘సలార్ 2’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. కానీ ‘సలార్ 2’ తర్వాత ఆయన కన్నడ చిత్రసీమకు తిరిగి వెళ్లుతారన్న ఊహాగానాలకు ఇప్పుడు పుల్ స్టాప్ పడినట్టుంది..తాజా సమాచారం ప్రకారం, సలార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్లో మరో స్టార్ హీరో రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నారట. మొదట ఈ కథను అల్లు అర్జున్ కోసం తయారు చేసినప్పటికీ, ప్రస్తుతం అదే స్క్రిప్ట్ రామ్ చరణ్కు మార్చారని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది..ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఈ కథకు సంబంధించిన స్క్రీన్ప్లే వర్క్పై ఫోకస్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే, 2027 చివరిలో లేదా 2028 మొదట్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కావచ్చు. విడుదలకు మరో రెండేళ్ల సమయం పట్టొచ్చన్న అంచనాలున్నాయి. కనీసం నాలుగైదేళ్ల వరకు టాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు..









