పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు.. ఇక ఇప్పటికే ఆయన ‘ఓజి’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.. అంతకంటే ముందు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కూడా పూర్తయ్యింది.. ఈ రెండూ సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి..ఈ సినిమాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి ఫుల్ గా రాజకీయాల్లో ఉంటారు అని చాలామందిలో ఉంది.. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆయన మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈసారి పవన్ కళ్యాణ్ ను డైరెక్ చేయబోయేది.. తమిళ దర్శకుడు & యాక్టర్ సముద్రఖని అని టాక్.. గతంలో పవన్ కళ్యాణ్, సముద్రఖని కాంబినేషన్లో ‘బ్రో’ సినిమా వచ్చిందన్న సంగతి తెలిసిందే.. ఇది తమిళంలో ఘన విజయాన్ని సాధించిన ‘వినోదయ సిత్తం’కి రీమేక్గా రూపొందింది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, సముద్రఖని కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చ జరుగుతోంది… ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ న్యూస్ విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..
