Search
Close this search box.

  బుల్లి తెరకు రోజా రీఎంట్రీ..?

రోజా ఒక్కప్పుడు వెండి తెరపై గా స్టార్ హీరోయిన్ గా వెలిగింది.. తర్వాత సినిమాలు బ్రేక్ ఇచ్చిన ఈ సినియర్ హీరోయిన్ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించింది.. ఈ షోలో నాగబాబుతో, రోజా కలిసి ఈ షో లో జడ్జి గా వ్యవహరించారు.. కామెడీ ఎంటర్టైనర్ ప్రధానంగా వచ్చిన ఈ షో జనాలకు తొందరగా కనెక్ట్ అయ్యింది. బాగా పాపులర్ అయ్యింది.ఈ షో పాపులర్ అవ్వడంతో రోజాకు మరిన్ని షోలు ఆఫర్స్ వచ్చాయి.. తరువాత రచ్చబండ, లాంటి కొన్ని షోలు చేస్తూ బుల్లి తెరకు పరిమితమైంది.. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది.. తరువాత పూర్తి గా రాజకీయాల్లో బిజీ గా మారిపోయింది.. 2024 వ సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో రోజా ఓడిపోయింది.. తన పార్టీ అధికారాన్ని కోల్పోయింది.. దాంతో రోజా ఇప్పుడు మళ్ళీ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.. ఐతే రీసెంట్ గా జీ టీవీ సంస్థ కొత్తగా వచ్చే షోకి రోజాను జడ్జిగా వ్యవహరించమని భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.. రోజాకు కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ ఆఫర్ కు ఒకే చెప్పినట్లు సమాచారం.. దీంతో మళ్లీ రోజా బుల్లి తెరకు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు