ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహ బంధంతో అధికారికంగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10:10 గంటలకు ఉదయ్పూర్లోని ఒక ప్యాలెస్లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. సాయంత్రం వేళ ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ప్రపంచానికి తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. తెలుగమ్మాయిగా మరియు కొడగు సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు రకాల ఆచారాలతో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
విజయ్ను తన భర్తగా పరిచయం చేస్తూ రష్మికా మందన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. “నాకు నిజమైన ప్రేమను, ప్రశాంతతను పరిచయం చేసిన వ్యక్తి ఇతనే. నా ఊహలకు అందని విధంగా నేను ఏదైనా సాధించగలనని ఎప్పుడూ నా వెన్నంటే ఉండి ప్రోత్సహించారు. ఈ వ్యక్తి గురించి నేను ఒక పుస్తకమే రాయగలను. విజయ్ భార్యగా మారడం నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ ఆమె తన మనసులోని భావాలను పంచుకున్నారు. రష్మిక తన పోస్ట్లో విజయ్ను కేవలం భర్తగానే కాకుండా, తన కలలకు మద్దతు ఇచ్చే ఒక గొప్ప తోడుగా అభివర్ణించారు.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా రష్మికను తన భార్యగా పరిచయం చేస్తూ ఎమోషనల్ అయ్యారు. “ఒకరోజు తనను చాలా మిస్ అయ్యాను.. తను పక్కన ఉంటేనే జీవితం సంపూర్ణంగా ఉంటుందని అప్పుడే నాకు అర్థమైంది. నా బెస్ట్ ఫ్రెండ్నే నా భార్యగా పొందాను” అంటూ విజయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు కల్యాణీ ప్రియదర్శన్, ఆషికా రంగనాథ్, ఈషా రెబ్బా, మరియు దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి సన్నిహితులు హాజరై సందడి చేశారు. వధూవరుల లుక్స్ అదిరిపోవడంతో అభిమానులు “మెడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.








