టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేరు వీరయ్య’తో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ జోడీ, మరోసారి రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్కు జోడీగా టాలెంటెడ్ నటి, నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రియమణి ఎంపికైనట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ప్రియమణి తెలుగులో గతంలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ, మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి, చిరు సరసన నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు సెంటిమెంట్కు ప్రాధాన్యత ఉన్న ఈ కథలో ప్రియమణి పాత్రకు మంచి స్కోప్ ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో చిరు సరసన నయనతార వంటి స్టార్ హీరోయిన్లు నటించి మెప్పించగా, ఇప్పుడు ప్రియమణి ఈ ప్రాజెక్ట్లోకి రావడంతో ఈ కాంబినేషన్ సరికొత్తగా ఉండబోతోందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.









