మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాత సాహు గారపాటి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి తదుపరి సినిమా కూడా తమ బ్యానర్లోనే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూస్తారని, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అద్భుతమైన కామెడీ ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని, సెన్సార్ బోర్డు నుంచి కూడా చాలా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఆనందించేలా సినిమా ఉంటుందని సుస్మిత కొణిదెల ఆశాభావం వ్యక్తం చేశారు.
సినిమా టైటిల్ విషయానికి వస్తే, చిరంజీవి అసలు పేరునే టైటిల్గా పెట్టాలనేది దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచన అని, పాత్రకు మరింత సహజత్వం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు వివరించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ఇద్దరు స్టార్ హీరోలు హాజరవుతారని, అభిమానులకు ఇది పెద్ద పండుగ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.









