టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి మరియు హీరో సుశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలపై మీనాక్షి టీమ్ అధికారికంగా స్పందించింది. వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందంటూ గత రెండు రోజులుగా కొన్ని మీమ్ పేజీలు, సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇవ్వబడింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మీనాక్షి టీమ్ స్పష్టం చేసింది.
కొద్ది రోజుల క్రితం మీనాక్షి, సుశాంత్ ఒక ఎయిర్పోర్టులో కలిసి కనిపించడం ఈ వదంతులకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో స్పందించిన మీనాక్షి టీమ్, “సుశాంత్, మీనాక్షి కేవలం మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరి మధ్య స్నేహం తప్ప మరే బంధం లేదు” అని తేల్చి చెప్పింది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.
ఇలాంటి పుకార్లను నమ్మవద్దని మీనాక్షి టీమ్ ప్రజలను కోరింది. నటికి సంబంధించిన ఏ ముఖ్య విషయమైనా తామే అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేసింది. గతంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగినప్పుడు స్వయంగా మీనాక్షి చౌదరి స్పందించి ఈ వార్తలను ఖండించారు. అయినప్పటికీ వదంతులు ఆగకపోవడంతో, తాజాగా ఆమె టీమ్ మరోసారి వివరణ ఇచ్చి, ఈ అనవసర ప్రచారానికి ఇకనైనా ముగింపు పలకాలని కోరింది.








