Search
Close this search box.

  ‘ఓజీ’ దర్శకుడు సుజీత్: నిర్మాత డీవీవీ దానయ్యపై పుకార్లకు ఫుల్‌స్టాప్

‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌ మరియు నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి సుజీత్ తన సోషల్ మీడియా పోస్టుతో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేస్తూ, నిర్మాత దానయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభం నుంచి ముగింపు వరకు నడిపించడానికి ఏం అవసరమో కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఆ విషయంలో నన్ను నమ్మి, నాకు అండగా నిలిచిన నా నిర్మాత దానయ్య గారికి, నా టీమ్‌కు మాటల్లో చెప్పలేనంతగా రుణపడి ఉంటాను” అని సుజీత్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుజీత్ ఉన్నట్టుండి ఈ కృతజ్ఞతా పోస్ట్ పెట్టడం వెనుక బలమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, సుజీత్ తన తదుపరి చిత్రాన్ని హీరో నానితో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైంది. ఈ అనూహ్య మార్పుతోనే సుజీత్‌కు, దానయ్యకు మధ్య దూరం పెరిగిందని, అందుకే నిర్మాణ సంస్థ మారిందనే పుకార్లు ఇండస్ట్రీలో షికారు చేశాయి.

ఈ రూమర్లకు బలం చేకూర్చేలా ‘ఓజీ’ నిర్మాణ సమయంలోనూ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలోనే, తన నిర్మాతతో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసేందుకే సుజీత్ ఈ పోస్ట్ పెట్టారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు