అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మొదట టబు ఎంట్రీ వార్త ప్రేక్షకులను ఎంతో ఎగ్జైట్ చేసింది. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మీ ఆవిడే’ వంటి చిత్రాలతో నాగార్జున – టబు కాంబినేషన్కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ జోడి మళ్ళీ తెరపై కనిపించబోతోందన్న వార్త అక్కినేని అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ఒకరు టబు కాగా, మరొకరు అనుష్క శెట్టి అని అంటున్నారు. ఈ కథ పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగనుందని, ఇందులో అనుష్క పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, ఒక పాత్ర సామాన్య మధ్యతరగతి వ్యక్తిగా, మరొకటి శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా ఉంటుందని టాక్. అనుష్కతో నాగార్జున రొమాన్స్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే వార్తలు అంచనాలను మరింత పెంచుతున్నాయి.
అంతేకాకుండా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో (క్యామియో రోల్) కనిపించనున్నట్లు తెలుస్తుండటం ఈ ప్రాజెక్ట్కు మరింత ఆసక్తిని జోడించింది. నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ ‘కింగ్ 100’ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి ముందే టబు, అనుష్క శెట్టి వంటి హీరోయిన్ల పేర్లు, చిరంజీవి క్యామియో వంటి భారీ అప్ డేట్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఈ భారీ మల్టీ-స్టారర్ కాంబినేషన్ల గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.









