త్రివిక్రమ్ శ్రీనివాస్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను సృష్టిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. అభిమానుల్లో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మొదట రుక్మిణి వసంత్ పేరు వినిపించగా, తాజాగా మీనాక్షి చౌదరి కూడా రేసులో ఉన్నారని టాక్. ఆమె గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “గుంటూరు కారం”లో నటించిన విషయం తెలిసిందే.
ఇక వెంకటేష్తో “సైంధవ్”లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్, అలాగే నేహా శెట్టి పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని త్రివిక్రమ్ హీరోయిన్గా ఫైనల్ చేస్తాడనేది ఆసక్తికరమైన విషయంగా మారింది..









