నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం ‘NBK111’కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను అధికారికంగా ఎంపిక చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జైసింహా’ వంటి ఘన విజయాల తర్వాత బాలయ్య-నయనతార కాంబో నాలుగోసారి తిరిగి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోందని, ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ఈ సినిమా చారిత్రక నేపథ్యం కలిగిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది, బాలకృష్ణ ఇందులో రెండు భిన్న టైమ్లైన్స్లో కనిపిస్తారని, అందులో ఒక పాత్ర రాజుగా ఉంటుందని తెలుస్తోంది. ‘వీర సింహారెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. ఈసారి కథ స్థాయి, ప్రొడక్షన్ విలువలు, విజువల్స్ అన్నీ పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతున్నాయని నిర్మాత సతీష్ కిలారు ప్రకటించారు.
హీరోయిన్ ఎంపిక కోసం పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ, చివరకు నయనతారను ఖరారు చేశారు. ఈ చిత్రం నవంబర్ 26న పూజా కార్యక్రమాలతో అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగానే మేకర్స్ నయనతారను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ అగ్ర తారల కాంబినేషన్ తిరిగి రావడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.









