Search
Close this search box.

  “పాన్ ఇండియా స్టార్‌లకు బాలీవుడ్ షాక్.. వరుసగా ఎదురైన చేదు అనుభవాలు..

August 16, 2025 10:06 AM | Aditya369 News

“పాన్ ఇండియా స్టార్‌లకు బాలీవుడ్ షాక్.. వరుసగా ఎదురైన చేదు అనుభవాలు..

ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్… తెలుగు డైరెక్టర్ల సినిమాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ఈ ముగ్గురూ ఒకే బారిన పడ్డారు. అదేంటంటే – బాలీవుడ్ డైరెక్టర్ల మాయలో పడటం.

మొదటగా రామ్ చరణ్ చేసిన ‘జంజీర్’ ఎంతటి ఫ్లాప్ అనేది చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఆయన ఇమేజ్‌కే దెబ్బతీసింది. తర్వాత ప్రభాస్ కూడా అదే తప్పు చేశాడు. స్టార్‌డమ్ పీక్‌లో ఉన్న సమయంలో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ ఘోర పరాజయం అయ్యింది. ప్రభాస్ లుక్స్ నుంచి సినిమాకి సంబంధించిన ప్రతి అంశం వరకు దారుణంగా ట్రోల్స్ అయ్యాయి. ఆ సినిమా ఆయన కెరీర్‌లోనే పెద్ద మైనస్‌గా మిగిలిపోయింది.

 

ఇక తాజాగా అదే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్కు ఎదురైంది. మొదట బాలీవుడ్ ఆఫర్లను దూరం పెట్టినా, చివరికి ఆదిత్య చోప్రా ఒత్తిడితో **‘వార్ 2’**లో నటించాడు. కానీ ఈ సినిమా కూడా ఎన్టీఆర్‌కు ఉపయోగం కానట్లే కనిపిస్తోంది. సినిమాలో హృతిక్ రోషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కడంతో, ఎన్టీఆర్‌ను సైడ్‌లో పెట్టేశారని అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో రిలీజ్ అయిన ‘కూలీ’ కలెక్షన్లతో పోలిస్తే, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తక్కువ వసూళ్లు సాధించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.

అందుకే ఇప్పుడు అభిమానుల మాట ఒక్కటే –

“మన స్టార్ హీరోలు ఇకపై బాలీవుడ్ డైరెక్టర్ల మాయలో పడకూడదు. లేదంటే ఇమేజ్‌కి నష్టం తప్పదు..

ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్… తెలుగు డైరెక్టర్ల సినిమాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ఈ ముగ్గురూ ఒకే బారిన పడ్డారు. అదేంటంటే – బాలీవుడ్ డైరెక్టర్ల మాయలో పడటం.

మొదటగా రామ్ చరణ్ చేసిన ‘జంజీర్’ ఎంతటి ఫ్లాప్ అనేది చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఆయన ఇమేజ్‌కే దెబ్బతీసింది. తర్వాత ప్రభాస్ కూడా అదే తప్పు చేశాడు. స్టార్‌డమ్ పీక్‌లో ఉన్న సమయంలో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ ఘోర పరాజయం అయ్యింది. ప్రభాస్ లుక్స్ నుంచి సినిమాకి సంబంధించిన ప్రతి అంశం వరకు దారుణంగా ట్రోల్స్ అయ్యాయి. ఆ సినిమా ఆయన కెరీర్‌లోనే పెద్ద మైనస్‌గా మిగిలిపోయింది.

 

ఇక తాజాగా అదే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్కు ఎదురైంది. మొదట బాలీవుడ్ ఆఫర్లను దూరం పెట్టినా, చివరికి ఆదిత్య చోప్రా ఒత్తిడితో **‘వార్ 2’**లో నటించాడు. కానీ ఈ సినిమా కూడా ఎన్టీఆర్‌కు ఉపయోగం కానట్లే కనిపిస్తోంది. సినిమాలో హృతిక్ రోషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కడంతో, ఎన్టీఆర్‌ను సైడ్‌లో పెట్టేశారని అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో రిలీజ్ అయిన ‘కూలీ’ కలెక్షన్లతో పోలిస్తే, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తక్కువ వసూళ్లు సాధించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.

అందుకే ఇప్పుడు అభిమానుల మాట ఒక్కటే –

“మన స్టార్ హీరోలు ఇకపై బాలీవుడ్ డైరెక్టర్ల మాయలో పడకూడదు. లేదంటే ఇమేజ్‌కి నష్టం తప్పదు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు