మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం, చిరు కెరీర్లో 158వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల ప్రకారం, ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉండబోతుందట. ఆ రోల్లో మెగా హీరో సాయి దుర్గ తేజ్ కనిపించనున్నాడని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్కు థియేటర్లలో డబుల్ ట్రీట్ ఖాయం అని చెప్పొచ్చు.
ఇక సినిమాకి మరో హైలైట్ ఏమిటంటే, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చిరంజీవి పూర్తిగా కొత్త లుక్లో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో ఆయన పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయని, ప్రతి షేడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసేలా డిజైన్ చేశారని టాక్.
ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండే ఈ కథను దర్శకుడు బాబీ, చిరంజీవిని పూర్తిగా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో రాసుకున్నారని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి.
KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మొత్తానికి చిరంజీవి – బాబీ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.









