గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ “పెద్ది”. మొదటి నుంచే భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ విషయంలో తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది..ఇప్పటికే తెలుగు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ని దాటి గ్లోబల్ స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఆ లిస్ట్లో ఇప్పుడు పెద్ది కూడా చేరబోతోందని టాక్. దీంతో రామ్ చరణ్ తన గ్లోబల్ మార్కెట్ను మరింతగా విస్తరించుకోవడానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు..ఈ చిత్రానికి సంగీతాన్ని మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ అందిస్తుండగా, భారీ బడ్జెట్తో వృద్ధి సినిమాస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది..









