బాలీవుడ్లో నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ భారీ అంచనాలతో మోస్ట్ అటెండెడ్ సినిమాల్లో ఒకటిగా మారింది.. ఇటీవల విడుదలైన గ్లింప్స్కు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..ఈ భారీ విజువల్ వండర్ సినిమాలో సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, రాక్ స్టార్ యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా కనిపించనున్నారు..ఈ ‘రామాయణ’ రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. మొదటి పార్ట్ దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.. ఐతే ఈ సినిమా బడ్జెట్ పై సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది.. ఈ ప్రాజెక్ట్కు దాదాపు 1600 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేయనున్నట్లు సమాచారం.. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోని అతి పెద్ద బడ్జెట్గా నిలుస్తుందని తెలుస్తోంది..ఇక ఇదే నిజమైతే ఈ సినిమా ఈ రేంజిలో ఉండబోతుందో అర్థమవుతుంది..గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ ఎపిక్ మూవీని ఎప్పుడు చూడగలమని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అధికారిక అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి..









