Search
Close this search box.

  అమ్రపాలీ సహా ఐఏఎస్ లకు హైకోర్టు కీలక ఆదేశాలు..

October 17, 2024 11:24 AM | Aditya369 News

అమ్రపాలీ సహా ఐఏఎస్ లకు హైకోర్టు కీలక ఆదేశాలు..

అమ్రపాలీ సహా ఐఏఎస్ అధికారులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేటాయించిన రాష్ట్రానికి వెళ్లి రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టుకు రావటం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. పిటీషన్ డిస్మిస్ చేస్తే మళ్లీ కోర్టుకు వస్తారని పేర్కొంది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లి పని చేయాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆ తరువాతనే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో అధికారుల కేటాయింపుల పైన డీఏపీటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వారు రిపోర్టు చేయాల్సి ఉంది.

 

హైకోర్టులో పిటీషన్

డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్‌ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రొనాల్డ్‌రోస్‌, శివశంకర్‌, హరికిరణ్‌, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌.. టీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. తమను బదిలీ చేయకుండా యథావిధిగా పనిచేసే చోటనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేయడానికి క్యాట్‌ నిరాకరించింది. కేటాయించిన రాష్ట్రంలో చేరడానికి డీవోపీటీ నేటి వరకు గడువు విధించింది. దీంతో తాజాగా బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు.

 

హైకోర్టు సూచనలు

వీరి పిటీషన్లను జస్టిస్ అభినంద్ కుమర్ శావిలి బెంచ్ విచారించింది. ఏ అధికారి ఎక్కడ పని చేయాలో చెప్పే అధికారం కోర్టుకు లేదని డీఓపీటీ న్యాయవాది వాదించారు. ఏ అధికారి ఎక్కడ పని చేయాలో కేంద్రంలోని సీనియర్ అధికారులు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. హైకోర్టు సైతం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా సేవ కోసమే అధికారులు ఉన్నారని పేర్కొంది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అధికారుల పిటీషన్ డిస్మస్ చేస్తే తిరిగి అప్పీల్ కు వెళ్తారని అభిప్రాయ పడింది. ట్రిబ్యునల్ తిరస్కరిస్తే కోర్టుకు రావటం సరి కాదన్నారు. ముందు నియమించిన చోటకు వెళ్లి రిపోర్టు చేయాలని కోర్టు అధికారులకు సూచించింది.

 

కేటాయించిన విధంగా..

క్యాట్...తరువాత కోర్టు సైతం అధికారులకు షాక్ తగిలింది. ఫలితంగా ముందుగా డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన అధికారులు ఈ సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంది. అదే విధంగా ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన వారు సైతం అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు రిపోర్టు చేయనున్నారు. అధికారుల వాదన వింటామని..ఇప్పుడు జోక్యం చేసుకోవటం సరి కాదని కోర్టు తేల్చి చెప్పింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఫలితంగా అధికారులు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ముందుగా విధుల్లో చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది

అమ్రపాలీ సహా ఐఏఎస్ అధికారులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేటాయించిన రాష్ట్రానికి వెళ్లి రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టుకు రావటం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. పిటీషన్ డిస్మిస్ చేస్తే మళ్లీ కోర్టుకు వస్తారని పేర్కొంది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లి పని చేయాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆ తరువాతనే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో అధికారుల కేటాయింపుల పైన డీఏపీటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వారు రిపోర్టు చేయాల్సి ఉంది.

 

హైకోర్టులో పిటీషన్

డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్‌ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రొనాల్డ్‌రోస్‌, శివశంకర్‌, హరికిరణ్‌, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌.. టీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. తమను బదిలీ చేయకుండా యథావిధిగా పనిచేసే చోటనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేయడానికి క్యాట్‌ నిరాకరించింది. కేటాయించిన రాష్ట్రంలో చేరడానికి డీవోపీటీ నేటి వరకు గడువు విధించింది. దీంతో తాజాగా బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు.

 

హైకోర్టు సూచనలు

వీరి పిటీషన్లను జస్టిస్ అభినంద్ కుమర్ శావిలి బెంచ్ విచారించింది. ఏ అధికారి ఎక్కడ పని చేయాలో చెప్పే అధికారం కోర్టుకు లేదని డీఓపీటీ న్యాయవాది వాదించారు. ఏ అధికారి ఎక్కడ పని చేయాలో కేంద్రంలోని సీనియర్ అధికారులు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. హైకోర్టు సైతం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా సేవ కోసమే అధికారులు ఉన్నారని పేర్కొంది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అధికారుల పిటీషన్ డిస్మస్ చేస్తే తిరిగి అప్పీల్ కు వెళ్తారని అభిప్రాయ పడింది. ట్రిబ్యునల్ తిరస్కరిస్తే కోర్టుకు రావటం సరి కాదన్నారు. ముందు నియమించిన చోటకు వెళ్లి రిపోర్టు చేయాలని కోర్టు అధికారులకు సూచించింది.

 

కేటాయించిన విధంగా..

క్యాట్…తరువాత కోర్టు సైతం అధికారులకు షాక్ తగిలింది. ఫలితంగా ముందుగా డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన అధికారులు ఈ సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంది. అదే విధంగా ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన వారు సైతం అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు రిపోర్టు చేయనున్నారు. అధికారుల వాదన వింటామని..ఇప్పుడు జోక్యం చేసుకోవటం సరి కాదని కోర్టు తేల్చి చెప్పింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఫలితంగా అధికారులు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ముందుగా విధుల్లో చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు