Search
Close this search box.

  బాలీవుడ్‌ ‘రామాయణ’ రెండు పార్ట్‌ల విడుదల తేదీలు ఖరారు..!

November 6, 2024 8:35 PM | Aditya369 News

బాలీవుడ్‌ ‘రామాయణ’ రెండు పార్ట్‌ల విడుదల తేదీలు ఖరారు..!

ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో 'రామాయణ' ఒకటి. నితేశ్‌ తివారి దర్శకత్వంలో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి తెలుగు నిర్మాత అల్లు అరవింద్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విశేషాలతో పాటు రిలీజ్‌ డేట్‌పై గత కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఎట్టకేలకు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది.

 

ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమా విడుదల తేదీలను తెలియజేస్తూ బుధవారం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 2026 దీపావళికి ఫస్ట్‌ పార్ట్‌ను, 2027 దీపావళికి సెకండ్‌ పార్ట్‌ను విడుదల చేస్తున్నట్లుగా ఆ ప్రకటనలో తెలిపింది. మొదటి పార్ట్‌ రావడానికే దాదాపు రెండు సంవత్సరాల సమయం వుంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన పలు న్యూస్‌లు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి.

 

ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్‌ అయ్యాయి. ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్న రణభీర్‌ సింగ్‌ ఈ చిత్రంలో పాత్ర కోసం ఆల్కహాల్‌ను మానేసి, ప్రత్యేక ఆహారాన్ని తీసుకుంటు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నాడు. ఈ చిత్రంలో సీత పాత్రలో ప్రముఖ కథానాయిక సాయి పల్లవి కనిపిస్తారు.

 

చిన్నప్పటి నుంచి స్వతహాగా దైవ భక్తురాలైన సాయి పల్లవి ఈ చిత్రంలో సీతమ్మ పాత్రను ఓ నటిగా కాకుండా, భక్తురాలిగా చేస్తున్నానని, ఇంత గొప్ప పాత్రలో నటించడం తన అదృష్టమని ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా ఈ సినిమాలో రావణుడిగా కేజీఎఫ్‌ యశ్‌, ఆంజనేయుడి పాత్రలో సనీ డియోల్‌, శూర్పణగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కైకేయిగా లారా కనిపిస్తారని సమాచారం.

 

ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్‌ కోసం దర్శకుడు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‌ సంభాషణలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌తో పాటు హాలీవుడ్‌ సంగీత దర్శకుడు హన్స్‌ జిమ్మెర్‌ సంగీతాన్ని అందిస్తున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్‌ తివారి దర్శకత్వంలో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి తెలుగు నిర్మాత అల్లు అరవింద్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విశేషాలతో పాటు రిలీజ్‌ డేట్‌పై గత కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఎట్టకేలకు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది.

 

ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమా విడుదల తేదీలను తెలియజేస్తూ బుధవారం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 2026 దీపావళికి ఫస్ట్‌ పార్ట్‌ను, 2027 దీపావళికి సెకండ్‌ పార్ట్‌ను విడుదల చేస్తున్నట్లుగా ఆ ప్రకటనలో తెలిపింది. మొదటి పార్ట్‌ రావడానికే దాదాపు రెండు సంవత్సరాల సమయం వుంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన పలు న్యూస్‌లు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి.

 

ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్‌ అయ్యాయి. ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్న రణభీర్‌ సింగ్‌ ఈ చిత్రంలో పాత్ర కోసం ఆల్కహాల్‌ను మానేసి, ప్రత్యేక ఆహారాన్ని తీసుకుంటు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నాడు. ఈ చిత్రంలో సీత పాత్రలో ప్రముఖ కథానాయిక సాయి పల్లవి కనిపిస్తారు.

 

చిన్నప్పటి నుంచి స్వతహాగా దైవ భక్తురాలైన సాయి పల్లవి ఈ చిత్రంలో సీతమ్మ పాత్రను ఓ నటిగా కాకుండా, భక్తురాలిగా చేస్తున్నానని, ఇంత గొప్ప పాత్రలో నటించడం తన అదృష్టమని ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా ఈ సినిమాలో రావణుడిగా కేజీఎఫ్‌ యశ్‌, ఆంజనేయుడి పాత్రలో సనీ డియోల్‌, శూర్పణగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కైకేయిగా లారా కనిపిస్తారని సమాచారం.

 

ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్‌ కోసం దర్శకుడు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‌ సంభాషణలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌తో పాటు హాలీవుడ్‌ సంగీత దర్శకుడు హన్స్‌ జిమ్మెర్‌ సంగీతాన్ని అందిస్తున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు