ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ చిత్రం (AA22/AA24) గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అందరూ ఊహించినట్లుగా ఆమె హీరోయిన్గా కాకుండా, బన్నీకి చెల్లెలి పాత్రలో నటించబోతున్నారని తాజా సమాచారం. ‘సీతారామం’లో సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మృణాల్ను ఇలాంటి పాత్రలో చూడాల్సి రావడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ పాత్ర కథలో అత్యంత కీలకమైనదని, బలమైన ఎమోషనల్ టోన్తో సాగుతుందని టాక్. అన్న-చెల్లెల మధ్య ఉండే సెంటిమెంట్ను అట్లీ తనదైన శైలిలో చూపించబోతున్నాడట. కథలో వచ్చే ప్రధాన మలుపులకు మృణాల్ పాత్రే కీలకం కానుందని తెలుస్తోంది. అయితే, మృణాల్ నిజంగానే సిస్టర్ రోల్ చేస్తారా? లేక మరో కీలక పాత్రలో కనిపిస్తారా? అన్నది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఆమె ముంబైలో జరిగిన షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
సన్ పిక్చర్స్ బ్యానర్పై సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక పవర్ఫుల్ డాన్ కథగా ఉండబోతుందట. ఈ క్రేజీ ప్రాజెక్టులో దీపికా పడుకోణె, జాన్వీ కపూర్ మరియు రష్మిక మందన్న ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో కూడా చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దపీట వేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.









